Showing posts with label హిస్టరీ. Show all posts
Showing posts with label హిస్టరీ. Show all posts

మహాదేవ గోవింద రనడే

 

  • పూర్తి పేరు – మహాదేవ గోవింద రనడే.
  • ఇతని రాజకీయ గురువు – ఎ.ఓ. హ్యూమ్.
  • ఇత‌ని ర‌చ‌న‌లు – Rise of Marata Power, Essays on Indian Economy
  • మహారాష్ట్రలో ప్రార్థనా సమాజంలో సభ్యుడు. ప్రార్ధనా సమాజ నిర్మాత. మహారాష్ట్రలో సాంఘికోద్యమానికి మూల పురుషుడు.
  • పశ్చిమ భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకుడైన యం.జి. రనడేను మహారాష్ట్ర సాంస్కృతిక ప్రవక్తగా అభివర్ణిస్తారు.
  • 1869లో జరిగిన ప్రథమ వితంతు వివాహానికి హాజరై సంఘ బహిష్కరణకు గురయ్యాడు.
  • 1866లో విష్ణుశాస్త్రి పండిట్ స్థాపించిన Bombay Widow Marriage Association కు యం.జి. రనడే గోపాల్ హరిదేశముఖ్‌ సహాయమందించారు.
  • ఇందు – ప్రకాశ్ అనే ఆంగ్ల-మరాఠీ పత్రికకు యం.జి. రనడే సంపాదకులుగా పనిచేశాడు. – గణేశ్ వాసుదేవ జోషి స్థాపించిన సార్వజనిక సభ కార్యక్రమాలకు సహాయమందించాడు.
  • 1870లో పూనా సార్వజనిక సభను స్థాపించాడు.
  • 1884లో పునాలో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించనది జి. జి. అగార్కర్.
  • 1887లో బొంబాయిలో యం.జి. రనడే స్థాపించిన సంఘం – Indian National Social Conference.
  • మరణం, జననం, గతించిన గతంను తిరిగి పునరుద్దరించలేము యం.జి.రనడే.

రమాబాయి రనడే

  • 1873లో యం.డి. రనడేను వివాహమాడారు.
  • 1915లో సేవా సదన్ సొసైటీని పూనేలో స్థాపించారు.
  • బొంబాయిలో Hindu Ladies Social Club ను స్థాపించారు.

 

అశోకుని శిలాశాసనాలు

 

1వ శిలాశాసనం: ఈ శాసనంలో జంతుబలిని, విందులు, వినోదాలను నిషేధించారు. (ఈ శాసనంలో ప్రియదస్సి అనే పేరు కనిపిస్తుంది. ప్రియదస్సి అనగా దేవుని ప్రేమకు నోచుకున్న వారు అని అర్థం)
2వ శిలాశాసనం : మనుషులకు, జంతువులకు వైద్య సదుపాయాలు, రోడ్ల నిర్మాణం, నీటిబావుల తవ్వకం, రోడ్లకిరువైపులా చెట్లను నాటడం ముఖ్యంగా ఔషధాలకు అవసరమయ్యే మొక్కలు పెంచడం మొదలైన ప్రజాహిత కార్యక్రమాలు పేర్కొన్నారు. (తమిళ రాజ్యాలైన చోళ, పాండ్యరాజ్యాల గురించి ప్రస్తావించారు)
3వ శిలాశాసనం : అశోకుడు బ్రాహ్మణులకు, శ్రమణులందరికీ సమానమైన గౌరవం ఇచ్చినట్లు తెలుపుతుంది. దీనిద్వారా అశోకుని మత సహన విధానం గురించి తెలుస్తుంది.
4వ శిలాశాసనం : అశోకుని ధర్మవిధానం గురించి ప్రధానంగా వివరించారు. ఈ ధర్మవిధానం వల్లనే అశోకుడు దేవానాం ప్రియ, ప్రియదర్శి అనే బిరుదులకు తగినవాడుగా చెప్పారు. ఇందులో అశోకుడు ధర్మభేరిని మోగించినట్లు, ధర్మభేరి, ధర్మప్రచారాన్ని సూచిస్తుంది. జంతువుల పట్ల ఆదరణ, బంధువుల పట్ల ప్రేమ, అహింస పాటించాలని పేర్కొన్నారు.

5వ శిలాశాసనం : అశోకుని సంక్షేమ చర్యలు తెలియ జేస్తాయి. వాటిలో ప్రధానంగా యజమాని సేవకుల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఖైదీలను సరిగా చూడాలని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంబంధాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకాధికారులను నియమించాడు. ధర్మ మహామాత్యుల ద్వారా ప్రజల సాంఘిక జీవనంలో ప్రభుత్వ జోక్యం ఆరంభమైనట్లు భావించచ్చు.
6వ శిలాశాసనం : అశోకుడు బౌద్ధ సంఘంలో చేరినట్లు బౌద్ధ సన్యాసిగా 250 రాత్రులు గడిపినట్లుగా ఉంది. అన్ని సమయాల్లో అనగా అంతఃపురంలో ఉన్నప్పుడు, భుజిస్తున్నప్పుడు, ఉద్యానవనంలో విహరిస్తున్నప్పుడు అధికారులు ప్రజా సమస్యలను తమకు నివేదించవచ్చునని ప్రకటించారు. ఈ శిలాశాసనంలో అశోకుడు ప్రజలందరూ నా బిడ్డలే అని పేర్కొన్నాడు.
7వ శిలాశాసనం : ప్రజలలో ఐకమత్యం సాధించాలని ఆశించారు. తెగలు, వర్గాల మధ్య పరస్పరం సహనం ఉండాలని పేర్కొన్నారు.
8వ శిలాశాసనం : ధర్మయాత్రల ద్వారా గ్రామీణులతో నిత్యసంబంధం కలిగి ఉండాలని తెలిపారు.
9వ శిలాశాసనం : అశోకుడు నిరాడంబరతను ప్రతిపాదించాడు. అర్థం లేని ఖర్చుతో కూడిన క్రతువుల పట్ల వ్యతిరేకత ప్రదర్శించాడు.
10వ శిలాశాసనం : తన ప్రజలందరూ (ధర్మాన్ని) సత్ప్రవర్తనను అలవరుచుకోవాలని కోరాడు.
11వ శిలాశాసనం : అశోకుడు నిరాడంబర జీవనానికి ప్రాధాన్యమిస్తూ తాను ఏర్పరిచిన ధర్మం సర్వామోదమైనదిగా తెలిపాడు. ఈ శాసనంలో కుటుంబ జీవనం, సంఘ జీవనం ఎంతో ప్రశాంతంగా ఉండాలని అశోకుడు భావించాడు. దమ్మను విస్తరించాలని తెలిపాడు.

12వ శిలాశాసనం: మతసహనానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు.
13వ శిలాశాసనం : కళింగ యుద్ధం గురించి పేర్కొన్నాడు. కళింగ యుద్ధానంతరం అశోకునిలో వచ్చిన మార్పు భేరీఘోషకు బదులు ధర్మఘోష వినిపించాలని దండయాత్రలకు బదులు ధర్మయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు.

-ఆంధ్రుల గురించి ఈ శాసనంలో పేర్కొన్నారు.
14వ శిలాశాసనం : ఇందులో రెండు ప్రత్యేక శిలాశాసనాలు ఉన్నాయి.
-న్యాయంగా నిష్పాక్షికంగా వ్యవహరించాలని అధికారులను కోరాడు.
-కొండజాతి ప్రజల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు, యువరాజులకు సలహాలు ఇచ్చాడు.

ఇతర శాసనాలు

1. కాందహార్ శాసనం: అశోకుని ధర్మవిధానం చేపలు పట్టేవారు, ఆటవికులను వ్యవసాయం చేసేటట్లు చేసిందని తెలియజేస్తుంది. ఇది రెండు భాషల్లో (గ్రీకు, అరామిక్) చెక్కారు.
2.రుమ్మిందై స్తంభశాసనం : సింహాసనం అధిష్టించిన 20 ఏండ్లకు లుంబిని ప్రాంతాన్ని అశోకుడు సందర్శించినట్లు ఉంది. లుంబిని ప్రాంతం నుంచి 1/8వ వంతు శిస్తు మాత్రమే వసూలు చేసినట్లు పేర్కొన్నారు.
3.సాగర్‌స్తంభ శాసనం: కొనకమన బుద్ధ స్తూపాన్ని అశోకుడు రెట్టింపు చేసిన విషయం తెలియజేస్తుంది.
4. బబ్రూ శాసనం : బౌద్ధం పట్ల విశ్వాసాన్ని తెలియజేస్తుంది.
5. దౌళి, జౌగడ శాసనాలు : హింసా వ్యతిరేకత, యుద్ధం పట్ల విముఖత.

-అశోకుడు అందరూ నా బిడ్డలే అని పేర్కొన్నాడు.
6. ఎర్రగుడి శాసనం: విద్యార్థుల్లో కూడా ధర్మాసక్తి కలిగించాలని అశోకుడు ఉపాధ్యాయులకు సూచించారు.
7. అలహాబాద్/ రాణిశాసనం: కారువాకి, తివరల గురించి పేర్కొన్నారు.
8.మహాస్థానా: కరువు సమయంలో తీసుకొనే చర్యలను ప్రస్తావించారు.
9. సోపారా : అశోకుడి లౌకిక విధానాన్ని తెలియజేస్తుంది. 

చంద్రశేఖర్ ఆజాద్

 

          భారత స్వాతంత్రోద్యమంలో చంద్రశేఖర్ ఆజాద్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అని ప్రగల్భాలు పలికే ఆనాటి తెల్లదొరల ప్రభుత్వం ఆజాద్ ని సజీవంగా పట్టుకోలేకపోయింది. 1931 ఫిబ్రవరి 27 ఆల్ఫ్రెడ్ పార్క్లో నిర్వహించిన ప్రజాగరన్ కార్య ్జక్రమంలో ఆయన తుడయ్యేంతవరకు పోలీసులు ఎప్పుడూ ఆయన్ని కనీసం తాకే సాహసం కూడా చేయలేకపోయారు.

         చంద్రశేఖర్ ఆజాద్ తన తుదిశ్వాస వరకు భారత స్వాతంత్య్రం కోసమే బతికారు. ఆయన మధ్యప్రదేశ్ లోని భాబ్రా గ్రామంలో 1906 జూలై 23 న్మించారు. వారి స్వస్థలం ఉతర్తప్రదేశ్ ఉన్నావో జిల్లాలోని బదర్కా గ్రామం. కానీ తన తండ్రి సీతారామ్ తివారీ రువు కారణంగా స్వగ్రామాన్ని విడిచిపెట్టి తుకుదెరువు కోసం తన కుటుంబాన్ని మధ్యప్రదేశ్ లోని భాబ్రాకు తరలించారట. ఆయనది చిన్నతనం నుంచి తిరుగుబాటు ధోరణి. ఆయన చదువుకంటే క్రీడల్లో ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు. తన పేరులో ఆజాద్ అనే దాన్ని జోడించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది.

          జలియన్ వాలాబాగ్ మారణకాండ యువ చంద్రశేఖర్ ని కదిలించింది. అతని ల్లి చంద్రశేఖర్ ని సంస్కృత పండితుడిగా చూడాలనుకుంది. కానీ ఆయన దేశాన్ని విముక్తి చేసే మార్గాన్నే ఎంచుకున్నారు. 1921లో హాయ నిరాకరణోద్యమం జరుగుతున్న సమయంలో ర్నాలో కూర్చున్న 15 ఏళ్ళ చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు రిచారు. అప్పుడు మెజిస్ట్రేట్ నీ పేరు, తండ్రి పేరు, నీ అడ్రస్ ఏమని ప్రశ్నించగా.. దానికి చంద్రశేఖర్ నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు స్వతంత్ర‌, నా అడ్రస్ జైలు అని సమాధానం చెప్పారు. జవాబుకు అతనికి శిక్ష డింది. కానీ, ఆజాద్ అనేది తన పేరుతో శాశ్వతంగా ముడిపడిపోయింది.

         ఎంతో ఉధృతంగా సాగుతున్న హాయ నిరాకరణోద్యమాన్ని చౌరీ- చౌరా ఘటనతో నిలిపివేయడం ఆయన్ని నిరాశపరచింది. శాంతియుత మార్గాలతో స్వాతంత్ర్యాన్ని సాధించలేమని భావించి తన కాం నారస్ కు మార్చుకున్నారు. రోజుల్లో భారతదేశంలో బెనారస్ విప్ల కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది

         1924 అక్టోబర్ లో కాన్పూర్ లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ను స్థాపించారు. ర్వాత అదే హిందుస్థాన్ సోషలిస్ట్రిపబ్లికన్ అసోసియేషన్గా మారింది. రామ్ ప్రసాద్ బిస్మిల్, జోగేష్ చటర్జీ, చంద్రశేఖర్ ఆజాద్, యోగేంద్ర శుక్లా, చీంద్రనాథ్ సన్యాల్, అష్ఫాఖుల్లా ఖాన్, రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరి, భగత్ సింగ్, భగవతి చరణ్ వోహ్రా, సుఖదేవ్ వంటి గొప్ప విప్లవకారులు అసోసియేషన్ కి ముఖ్య భ్యులుగా ఉన్నారు. ర్వాత దశాబ్దంలో పేర్లన్నీ దేశ ప్రజలని ఎంతగానో ఆకర్షించి అనేక మంది వారి బాటను అనుసరించేందుకు దోహదపడ్డాయి బ్రిటీష్ వారిని భయపెట్టాయి. ర్వాత 1925లో రిగిన కకోరి రైలు సంఘటనలో సంస్థకు చెందిన చాలా మంది భ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఆజాద్, కుందన్లాల్ పోలీసుల నుంచి తప్పించుకున్నారు.

         1927 డిసెంబర్ 17 డి.ఎస్.పి జాన్ సాండర్స్ ని హత్య చేసిన అనంతరం భగత్ సింగ్, రాజ్ గురులు డిఎవి కాలేజ్ వైపు పరుగులు తీస్తుండగా చందన్ సింగ్ అనే ఒక కానిస్టేబుల్ వారి వెంటపడ్డాడు. చందన్ సింగ్ భగత్సింగ్ కి అతి చేరువగా సమీపించి అతన్ని ట్టుకునే ప్రయత్నం చేయగా దూరం నుంచి చంద్రశేఖర్ ఆజాద్ కాల్చిన తూటా అతని కాలిలో దిగబడింది.

         1929లో సెంట్రల్ అసెంబ్లీబాంబు దాడి కేసులో సంస్థకు చెందిన అనేక మంది భ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కానీ సంఘటనల్లో కీలకపాత్ర పోషించిన ఆజాద్ ని మాత్రం ట్టుకోలేకపోయారు. ఆజాద్ జన్మస్థలం అయిన భాబ్రాని సందర్శంచిన తొలి ప్రదాని రేంద్ర మోదీ. ప్రధాని రేంద్ర మోదీ 2016లో తను చేపట్టినజర యాద్ కరో కుర్బానీ’ (త్యాగాన్ని స్మరించుకుందాం) కార్యక్రమాన్ని గ్రామం నుంచే ఆయన మొదలుపెట్టారు.

స్వామి దయానంద సరస్వతి

 

 


        1824 ఫిబ్రవరి 12 తేదీన గుజరాత్ లోని టంకారాలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన దయానంద సరస్వతి తొలి పేరు మూల్ శంకర్. హిందూ కేలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసం కృష్ణ పక్షంలో ఆయన జన్మదిన వేడుక జరుగుతుంది. కుటుంబం సంపన్నమైనది కావడంతో ఆయన ప్రారంభ జీవితం ఎంతో సౌకర్యవంతంగా సాగింది. 20 సంవత్సరాల పాటు ఆయన దేవాలయాలు, ప్రారనా ్థ ్థలాలు, పవిత్ర స్థలాల సందర్శనకు దేశం అంతటా తిరిగారు. తనలోని అనుమానాల నివృత్తి కోసం ఆయన పర్వతాలు, అడవుల్లో ఉన్న ఎందరో యోగులను కలిశారు, కానీ, ఎవరి నుంచి సంతృప్తికరమైన సమాధానం పొందలేకపోయారు. చివరికి ఆయన మధురలో స్వామి విరాజానందను కలిశారు. మూల్ శంకర్ ఆయన శిష్యుడుగా చేరారు. వేదాల నుంచి నేరుగా అధ్యయనం చేయాలని విరాజానంద ఆయనను ఆదేశించారు. అధ్యయనం సందర్భంగా జీవితం, మరణంపై గల అనుమానాలన్నింటికీ ఆయన సమాధానం చెప్పారు. మూల్ శంకర్ కు వైదిక జ్ఞానాన్ని సమాజంలో ప్రచారం చేసే బాధ్యత స్వామి విరాజానంద అప్పగించారు. అతనికి రిషి దయానందగా నామకరణం చేశారు.

         1875 ఏప్రిల్ లో ముంబైలో దయానంద సరస్వతి ఆర్య సమాజం స్థాపించారు. అది ఒక హిందూ సంస్కరణోద్యమం. ఊహాత్మకమైన విశ్వాసాల నుంచి బయటపడాలన్నది సమాజం ధ్యేయం. వేదాల శక్తి అపారమైనదని ఆయన భావించేవారు. తత్వశాస్ర్తానికి కర్మ సిద్ధాంతం, పునరన్మ, బ్రహ్మచర ్జ ్యం, సన్యాసం అనే నాలుగు మూలస్తంభాలను ఆయన అందించారు.

        1876లో తొలిసారిగా స్వరాజ్య పిలుపు ఇచ్చింది ఆయనే అని చెబుతారు. తర్వాత లోకమాన్య తిలక్ పిలుపును ముందుకు నడిపించారు. సత్యార్ ప్రకాశ్ గు థ్ రించి రాస్ ఆయన భక్ తూ తిజ్ఞానంతో పాటు సమాజంలో నైతిక విలువల పెంపునకు, సంఘ సంస్కరణకు ప్రాధాన్యం ఇచ్చారు. కపటత్వం, ఆగ్రహం, క్రూరత్వం, మహిళలపై దురాగతాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. మతంలో మూఢనమ్మకాలు, దురాచారాలు, కపట వైఖరిని వ్యతిరేకించిన ఆయన వాసవ మత ్త స్వభావాన్ని ఆవిష్కరించారు.

         స్వామి దయానంద సరస్వతి మత చైతన్యం రగిలించడమే కాదు దేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తం చేయడానికి జాతీయ తిరుగుబాటుకు కూడా తన వంతు సహకారం అందించారు. ఆర్య సమాజం ద్వారా సామాజిక సంస్కరణల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అస్పృశ్యత, సతి, బాల్య వివాహాలు, నరబలి, మత సంకుచిత వాదం, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశారు. వితంతు పునర్వివాహం, మత స్వేచ్ఛ, సౌభ్రాతృత్వానికి మద్దతు పలికారు.

         స్వామి దయానంద సరస్వతి 1883లో జోధ్ పూర్ మహారాజు వద్దకు వెళ్లారని చెబుతారు. స్వామి దయానంద సరస్వతి నుంచి స్ఫూర్తి పొందిన రాజా యశ్వంత్ సింగ్ ఒక రాజనర్తకితో తనకు గల సంబంధం తెగతెంపులు చేసుకున్నారు. దాంతో ఆగ్రహం చెందిన రాజనర్తకి వంటవానితో కలిసి కుట్ర చేసి స్వామీజీకి అందించిన ఆహారంలో గాజుముక్కలు కలిపింది. కారణంగా స్వామీజీ ఆరోగ్యం క్షీణించి 1883 అక్టోబర్ 30 తేదీన మరణించారు.



ఇండియన్ అసోసియేషన్ (Indian National Association)

          1876లో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనందమోహన్ బోస్ నాయకత్వలో ఉన్న యువ బెంగాల్ జాతీయవాదులు దీన్ని స్థాపించారు. ఈ సంస్థ ముఖ్య ఆశయాలు:

1. ఉమ్మడి రాజకీయ కార్యక్రమాలతో భారత ప్రజలను సమైక్యపరచడం.
2. హిందూ ముస్లిం సఖ్యతను పెంపొందించడం.
3. దేశంలో బలమైన ప్రజాభిప్రాయాన్ని సృష్టించడం మొదలైనవి. ఇండియన్ అసోసియేషన్ రాజకీయ సమైక్యతా సాధన దిశగా నడిచింది.

          ఈ అసోసియేషన్ 1883లో కలకత్తాలో మొదటి జాతీయ సమావేశాన్ని నిర్వహించింది. 1885 డిసెంబర్ 25, 26, 27 తేదీల్లో బొంబాయిలో జరిగిన రెండో సమావేశంలో అనేక అంశాలు చర్చించారు. అయితే 1885 డిసెంబరు 28న ఏఓ హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించాడు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన ఉమేష్‌చంద్ర బెనర్జీ ఆహ్వానం మేరకు సురేంద్రనాథ్ బెనర్జీ 1886లో తాను నెలకొల్పిన నేషనల్ కాన్ఫరెన్స్‌ను జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశాడు.

ముర్షీద్ కులీ ఖాన్ | Murshid Quli Khan

 

  • ఔరంగజేబు కాలంలో ఇతను బెంగాల్ గవర్నర్‌గా నియమించబడ్డాడు.
  • 1707లో ఔరంగజేబు మరణం తర్వాత బెంగాల్లో స్వతంత్రం ప్రకటించుకున్నాడు. కాబట్టి స్వతంత్ర బెంగాల్ స్థాపకుడు ముర్షీద్ కులీఖాన్.
  • ఇతను ముర్షీదాబాద్ అనే నగరాన్ని కట్టి రాజధానిగా చేసుకొని పరిపాలించాడు.
  • పాలనను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించి హిందువులకు, ముస్లింలకు సమానంగా ఉపాధి అవకాశాలు కల్పించాడు.
  • భారతీయ, విదేశీ వ్యాపారాలను ప్రోత్సహించి వర్తక, వాణిజ్యాల విస్తరణ చేపట్టాడు.
  • విదేశీ వర్తక కంపెనీల కార్యకలాపాల మీద కచ్చితమైన నియంత్రణ పాటించడం, ఔరంగజేబు (1691) ఫ‌రూఖ్‌సియార్‌‌ (1717) జారీ చేసిన ఫర్మానాల ద్వారా ఈస్టిండియా కంపెనీ సమకూర్చిన ప్రత్యేక హక్కులను ఆ కంపెనీ ఉద్యోగులు దుర్వినియోగం చేయకుండా నివారించాడు.
  • ఇతని తరువాతి పాలకులు షుజా ఉద్దౌలా, హైదర్జంగ్, ఆలీవర్ది ఖాన్, సిరాజుద్దౌలా, మీర్ ఖాసిం, నాజీం ఉద్దౌలా.
  • ముర్షిద్ మరణించిన తరువాత ఇతని అల్లుడు షుజా ఉద్దౌలా, తరువాత హైదర్జంగ్ బెంగాల్ను పాలించారు.
  • బీహార్‌లో డిప్యూటీ గవర్నర్ అయిన ఆలీ వర్ధి ఖాన్, హైదర్జంగ్ను చంపి 1741లో బెంగాల్‌ను ఆక్రమించాడు.
  • ఆలీవర్దీ ఖాన్ కాలంలో దక్షిణ భారతదేశం కర్ణాటక యుద్దాలు మొదలయ్యాయి.
  • 1756లో ఆలీ వర్దీ ఖాన్ మరణించడంతో అతని మనువడు సిరాజ్ ఉద్దౌలా బెంగాల్ నవాబు అయ్యాడు.

కలకత్తా చీకటి గది ఉందంతం | Black Hole of Calcutta

 

    • బెంగాగాల్‌లో బ్రిటిష్, ఫ్రెంచ్ వాళ్లు తమ స్థావరాల చుట్టూ రక్షణ గోడలను నిర్మించుకోవడం ప్రారంభించారు.
    • ఈ రక్షణ గోడల నిర్మాణమును ఆపేయాలని సిరాజ్ ఆజ్ఞలను జారీ చేశాడు. చంద్రనాగూర్‌లో ఉన్న ఫ్రెంచి వారు దీనిని అంగీకరించగా బ్రిటిషర్లు తిరస్కరించారు.
    • దీంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ ఫోర్ట్ విలియంను 1756 జూన్ 20న ఆక్రమించాడు.
    • కాశీంబ‌జార్‌పై దాడి చేసి బ్రిటిష్ స్థావరాలను ధ్వంసం చేసి సుమారు 146 మందిని ఓ చీకటి గదిలో బంధించాడు.
    • ఇందులో 23 మందే బ్రతికినట్లు హల్వెల్ ప్ర‌క‌టిస్తారు. దీన్నే కలకత్తా చీకటి గది ఉందంతం అంటారు.
    • కలకత్తా ఆక్రమణ తర్వాత సిరాజ్ కలకత్తాకు పెట్టిన పేరు – అలీసాగర్
    • కలకత్తాకు నియమింపబడిన సాలకుడు – మాణిక్ చంద్
    • బ్రిటిష్ సేనాని రాబర్ట్ క్లైవ్ మాణిక్ చంద్కు బహుమానాలిచ్చి కలకత్తాను మళ్లీ ఆక్రమిస్తాడు.
    • తర్వాత క్రీ.శ. 1757 ఫిబ్రవరి 9న బ్రిటిషర్లతో సిరాజ్ అలీసాగర్ సంధి చేసుకుంటాడు.
    • అంతవరకు బ్రిటిషర్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాపై వారి హక్కును గుర్తించాడు.
    • ఆలీనగర్ సంధిని ఉల్లంఘిస్తూ రాబర్ట్ క్లైవ్ ఫ్రెంచ్ వర్తక స్థావరం చంద్ర‌నాగూర్‌ను ముట్టడిస్తాడు.
    • ఈ ముట్టడిలో ఓడిన ఫ్రెంచ్ వాళ్లకు సిరాజ్ ఆశ్రయం ఇస్తాడు.

సిరాజ్ ఉద్దౌలా | Siraj ud Daulah


    • సిరాజ్ ఉద్దౌలా అసలు పేరు మీర్జా మహమ్మద్. ఆలివర్దీ ఖాన్ 3వ కూతురు కొడుకు. తన తరువాతి వారసుడిగా సిరాజ్ ఉద్దౌలానే అలీవర్దీ ఖాన్ ప్రకటించాడు.
    • ఇతని పట్టాభిషేకంను బ్రిటిష్ వారు బహిష్కరించారు. ఇతనే బెంగాల్ చివరి స్వంతంత్ర నవాబు.
    • బెంగాల్లో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం చంద్రనాగూర్
    • బ్రిటీష్ వారి ప్రధాన వర్తక స్థావరం – కలకత్తా
    • ఇదే టైంలో దక్షిణ భారత్లో బ్రిటిష్, ఫ్రెంచ్ వారి మధ్య మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం మొదలైంది.
    • బెంగాగాల్‌లో బ్రిటిష్, ఫ్రెంచ్ వాళ్లు తమ స్థావరాల చుట్టూ రక్షణ గోడలను నిర్మించుకోవడం ప్రారంభించారు.
    • సిరాజ్ ఈ రక్షణ గోడల నిర్మాణమును ఆపేయాలని ఆజ్ఞలను జారీ చేశాడు. చంద్రనాగూర్‌లో ఉన్న ఫ్రెంచి వారు దీనిని అంగీకరించగా బ్రిటిషర్లు తిరస్కరించారు.
    • దీంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ ఫోర్ట్ విలియంను 1756 జూన్ 20న ఆక్రమించాడు.
    • కాశీంబ‌జార్‌పై దాడి చేసి బ్రిటిష్ స్థావరాలను ధ్వంసం చేసి సుమారు 146 మందిని ఓ చీకటి గదిలో బంధించాడు.
    • ఇందులో 23 మందే బ్రతికినట్లు హల్వెల్ ప్ర‌క‌టిస్తారు. దీన్నే కలకత్తా చీకటి గది ఉందంతం (Black Hole of Calcutta) అంటారు.

    • కలకత్తా ఆక్రమణ తర్వాత సిరాజ్ కలకత్తాకు పెట్టిన పేరు – అలీసాగర్
    • కలకత్తాకు నియమింపబడిన సాలకుడు – మాణిక్ చంద్
    • బ్రిటిష్ సేనాని రాబర్ట్ క్లైవ్ మాణిక్ చంద్‌కు బహుమానాలిచ్చి కలకత్తాను మళ్లీ ఆక్రమిస్తాడు.
    • తర్వాత క్రీ.శ. 1757 ఫిబ్రవరి 9న బ్రిటిషర్లతో సిరాజ్ అలీసాగర్ సంధి చేసుకుంటాడు.
    • అంతవరకు బ్రిటిషర్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాపై వారి హక్కును గుర్తించాడు.
    • ఆలీనగర్ సంధిని ఉల్లంఘిస్తూ రాబర్ట్ క్లైవ్ ఫ్రెంచ్ వర్తక స్థావరం చంద్ర‌నాగూర్‌ను ముట్టడిస్తాడు.
    • ఈ ముట్టడిలో ఓడిన ఫ్రెంచ్ వాళ్లకు సిరాజ్ ఆశ్రయం ఇస్తాడు.

బక్సార్ యుద్ధం | Battle of Buxar (1764)

 

  • అవధ్ నవాబు ఘిజాఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం, మీర్ ఖాసీం కూటమికి, బ్రిటిషు వారికి 1764లో బీహార్‌లోని బక్సార్ నగరంలో యుద్ధం జరిగింది.
  • ఈ యుద్ధంలో మీర్ ఖాసీం కూటమి ఓడింది.
  • యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించినది సర్ హెక్టర్ మన్రో
  • ఆంగ్లేయుల బెంగాల్‌కు వాస్తవ పాలకులుగా మార్చిన యుద్ధమిది.

అలహాబాద్ సంధి (1785)

  • బక్సార్ యుద్ధంలో ఓడిన ఘాజా ఉద్దౌలా, రెండవ షాఅలం బ్రిటిషర్లతో (రాబర్ట్ క్లైవ్) అలహాబాద్ సంధి కుదుర్చుకున్నారు.
  • ఈ సంధి ప్రకారం ఒరిస్సా, బెంగాల్, బీహార్లలోని దివానీ హక్కులను రెండవ షాఆలం ఆంగ్లేయులకు సొంతం చేశాడు.
  • బక్సార్ యుద్ధ కాలంలో బెంగాల్ గవర్నర్ నాన్సి టార్ట్.
  • బక్సార్ యుద్ధానంతరం బెంగాల్ నవాబు వసీం ఉద్ దౌలా

ప్లాసీ యుద్ధం | Battle of Plassey (1757)

 

  • సిరాజ్ ఉద్దౌలా మ‌రియు రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగిన యుద్ధం ప్లాసీ యుద్ధం. 1757లో జ‌రిగింది.
  • యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ కు మద్దతు తెలిపిన కుట్రదారులు మీర్ జాఫర్. ఇత‌ను సిరాజ్ యొక్క సైన్యాధ్యక్షుడు.
  • సైన్యాధ్య‌క్షుడిని మీర్ భక్షి అంటారు. మ‌రొక‌రు మిరాన్. ఇత‌ను మీర్ జాఫర్ కొడుకు. ఇంకా వ్యాపారి అమీన్ చంద్ (మధ్యవర్తి), కలకత్తా ఇన్చార్జ్ మాణిక్ చంద్, బెంగాగ్‌లో అత్యంత ధనికుడు జగత్ సేట్ స‌హ‌క‌రించారు.
  • సిరాజ్ సైనిక అధికారులు రాయ్ దుర్లభ్, ఖాదీమ్ ఖాన్.
  • 1757లో జూన్ 23న జ‌రిగిన ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ ‘సిరాజ్ ఉద్దౌలాను ఓడించాడు.
  • మీర్ మదన్, మోహన్ లాల్ సైనికులు సిరాజ్ తరపున వీరోచితంగా పోరాడి మరణించారు.
  • పారిపోతున్న సిరాజ్‌ను మీర్ జాఫర్ కొడుకు మిరాన్ పట్టుకొని ఉరితీశాడు.
  • 1757లో మీర్ జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. 1757 నుంచి 1760 వ‌ర‌కు పాలించాడు.
  • ఈ యుద్ధం త‌ర్వాత‌ బెంగాలులో, తరువాత భారత్‌లో ఆధిపత్యం చెలాయించడానికి ఆంగ్లేయులకు మార్గం సుగమమయింది.
  • యుద్ధ నష్ట పరిహారం కింద రూ. 177 లక్షలు, కలకత్తా సమీపంలోని 24 పరగణాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి లభించాయి.
  • కంపెనీ తొలిసారి 1757లో కలకత్తాలో టంకశాల తెరిచింది. తమ అధికారులకు పెద్దగా జీతాలు ఇవ్వడం ప్రారంభించింది.
  • వీటన్నింటి కన్నా ముఖ్యంగా ప్లాసీ యుద్ధంతో దేశంలో బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీ పెద్ద ఎత్తున ప్రారంభమైంది.
  • 1760లో ఆంగ్లేయులు మీర్ జాఫర్‌ను తొలగించి మీర్ ఖాసింను బెంగాల్ నవాబుగా నియమించారు.
  • కృతజ్ఞతగా మీర్ ఖాసిం ఆంగ్లేయులకు బుర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టగాంగ్ జిల్లాలను ఇచ్చాడు.
  • మీర్ ఖాసీం బెంగాల్ రాజధానిని ముర్షీదాబాద్ నుంచి మాంఘీర్‌కు మార్చాడు.
  • 1760లో క్లైవ్ ఇంగ్లాండ్ వెళ్లాక కొంతకాలం హాల్వెల్ గవర్న‌ర్‌గా చేశాడు. ఆ తర్వాత వాన్సిట్టార్ట్ బెంగాల్ గవర్న‌ర్‌గా చేశాడు.
  • 1763లో ఆంగ్లేయులు మీర్ ఖాసింనూ బెంగాల్ నవాబుగా తొలగించారు. మళ్లీ మీర్ జాఫర్ గ‌వ‌ర్న‌ర్ అయ్యాడు.
  • భారత్‌లో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపనకు పునాది వేసింది, తూర్పు ఇండియా కంపెనీ ఓ రాజకీయ శక్తిగా రూపొందుటకు పునాది వేసిన యుద్ధం ప్లాసీ యుద్ధం.

కర్ణాటక ఆక్రమణ (లేక) ఆంగ్లో – కర్ణాటక యుద్ధాలు

 

  • దేశానికి వ్యాపారం కోసం వచ్చి బ్రిటిష్, ఫ్రెంచ్ వారి పోటీ తట్టుకోలేక వెళ్లిపోయింది – పోర్చుగీసు, డచ్చివారు పోర్చుగీసు,
  • డచ్చివారు వెళ్లిపోవడంతో దేశంలో మిగిలిన యూరోపియన్లు – బ్రిటిష్, ఫ్రెంచివారు
  • వాణిజ్యం విషయంలో ఆంగ్లేయులు, ఫ్రెంచి వారి మధ్య తలెత్తిన పోటితో పాటు దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి వారు తర్వాత చేసిన ప్రయత్నాలు చివరికి కర్ణాటక యుద్ధానికి దారి తీశాయి. దేశంలో బ్రిటిష్, ఫ్రెంచి వారి మధ్య జరిగిన
  • యుద్ధాలను ఆంగ్లో, కర్ణాటక యుద్ధాలంటారు. మొత్తం 3 యుద్ధాలు జరిగాయి.
  • మొదటి కర్ణాటక యుద్ధం – 1744-18
  • రెండో కర్ణాటక యుద్ధం – 1749-54
  • మూడో కర్ణాటక యుద్ధం – 1766-63
  • మూడో కర్ణాటక యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్లకు ఫ్రెంచ్ వారి నుంచి పోటీ లేకుండా పోయింది. దీంతో దక్షిణ భారత రాజకీయాల్లో బ్రిటిషర్లు బలమైన శక్తిగా ఎదిగారు.
  • దక్కన్‌లో రాజకీయ అనిశ్చితి, యూరప్లో ఆస్ట్రియా వారసత్వ సమస్య, రాజ్యకాంక్ష, తీవ్రమైన వ్యాపార పోటీ

ఆంగ్లో-ఫ్రెంచ్ సంఘర్షణ లేదా కర్ణాటక ఆక్రమణ

  • ఆంగ్లో-ఫ్రెంచి కంపెనీలు భారతదేశంలోని స్థానిక పాలకులతో కలిసి చేసిన యుద్ధాలనే కర్ణాటక యుద్ధాలు అంటారు.
  • కర్ణాటక ప్రాంతం మొగల్ సామ్రాజ్యంలో అంతర్భాగమ‌య్యాక మొగల్ చక్రవర్తిచే నియమించబడిన నవాబు కర్ణాటకను పాలించేవాడు.
  • ఔరంగజేబు (1707లో) మరణించిన తరువాత మొఘలులచే నియమింపబడిన కర్ణాటక నవాబు సాదుతుల్లా ఖాన్ స్వతంత్రం ప్రకటించుకున్నాడు. కర్ణాటక రాజ్యమును స్థాపించిచాడు.
  • సాదుతుల్లా ఖాన్ తర్వాత నవాబు దోస్త్ అలీ. దోస్త్ అలీ కొడుకు సఫదర్ అలీ. దోస్త్ అలీ అల్లుడు చాంద్ సాహెబ్.
  • 1710 నుంచి 1732 వరకు సాదతుల్లాఖాన్ కర్ణాటక నవాబుగా పరిపాలించాడు. అతని తర్వాత దోస్త్ అలీ 1732 నుండి 1740 వరకు పాలించాడు. ఇతని కాలంలో పీష్వాలు, హైదరాబాద్ నిజాం కర్నాటక ప్రాంతాన్ని ఆక్రమించారు.
  • తంజావూరు రాజు నుంచి కరైకల్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రెంచ్ గవర్నర్ ‘డ్యూమాస్’ ప్రయత్నం చేశాడు. ఇతనికి దోస్త్ అలీ అల్లుడైన చందాసాహెబ్ సహకరించాడు.
  • తంజావూరు రాజుగారి పిలుపు మేరకు మరాఠా పాలకుడు సాహూ తన సైన్యాలను పంపాడు.
  • కర్ణాటక ఆక్రమణ కోసం ఇక్కడ జరిగిన యుద్ధం దామలచెరువు యుద్ధం (1742).
  • సాహు, తంజావూరు రాజు క‌లిసి దోస్త్ అలీ, చాంద్ సాహెబ్, డ్యూమస్ (ఫ్రెంచి గవర్నర్)పై యుద్ధం చేశారు.
  • కర్నాటక (ఆర్కాట్) నవాబ్ దోస్త్ అలీ మరణించగా యుద్ధం తరువాత దోస్త్ అలీ కొడుకు సఫదత్ అలీ నవాబుగా వ‌స్తాడు. ఇతన్ని వేలూరు పాలకుడు ముర్తాజ్ అలీ చంపేస్తాడు.
  • చందాసాహెబ్‌ను బందీని చేసి మరాఠాలు మొదట బీరార్‌కు, తరువాత సతారాకు తీసుకువెళ్లారు.
  • ఆ తరువాత జరిగిన అంతర్గత అల్లర్లను ఆసరాగా తీసుకొని దోస్త్ ఆలీ సహచరుడు అన్వరుద్దీన్ కర్ణాటక పాలకునిగా ప్రకటించుకున్నాడు.
  • కానీ ఇతన్ని హైదరాబాద్ నిజాం, దోస్త్ అలీ బంధువులు నవాబుగా గుర్తించలేదు. ఇదే టైంలో బంధీగా ఉన్న చందాసాహెబ్‌ను మరాఠీలు విడుదల చేశారు.
  • ఈ టైంలోనే ఐరోపాలో ఆస్ట్రియా సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం భారతదేశంలో మొదటి కర్ణాటక యుద్ధానికి కారణమైంది.
  • అన్వరుద్దీన్ కాలంలో మొదటి, రెండవ కర్ణాటక యుద్ధాలు జరిగాయి.

 

మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం | First Carnatic War (1744-48)

  • ఈ యుద్ధం నాటి ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ డూప్లే. ఈ స‌మ‌యంలో బ్రిటిష్ సేనాని బార్నెట్
  • యుద్ధంలో గెలిచిన‌‌ డూప్లే మద్రాసును ఆక్రమించాడు.
  • యుద్ధం జ‌ర‌గ‌డానికి ముఖ్యకారణం ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఆక్సిలా చాపెల్ సంధితో ఈ యుద్ధం ముగిసింది.
  • 1740 మార్చి నెలలో ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ పాల్గొనడంతో వారి వాణిజ్యం, కంపెనీలున్న భారతదేశానికీ వారి వైషమ్యాలు వ్యాపించాయి.
  • ఆస్ట్రియా వారసత్వ యుద్ధం వల్ల దేశంలో బ్రిటిష్, ఫ్రెంచి వారి మధ్య మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం మొదలైంది.
  • దేశంలో ఫ్రెంచి నౌకలపై బ్రిటిష్ జరనల్ బార్నెట్ దాడి చేసి వాటిని ధ్వంసం చేశాడు.
  • దేశంలో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మారిషస్‌లో ఉన్న బోర్డినాయిస్‌ను భారత్ పిలిపించి ఇద్దరూ కలసి బ్రిటిష్ స్థావరమైన మద్రాస్ను ఆక్రమించారు.
  • కానీ బోర్డినాయిస్ లంచం తీసుకొని మద్రాస్‌ను బ్రిటిషర్లకు అప్పగించి మారిషస్ వెళ్లిపోతాడు.
  • అప్పుడు కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ సాయంతో మద్రాస్ను తిరిగి ఫ్రెంచ్ జనరల్ డూప్లే ఆక్రమించాడు.
  • దీనికంటే ముందు డూప్లే, అన్వరుద్దీన్ మధ్య ఓ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం మద్రాస్ను ఆక్రమించి తర్వాత దాన్ని అన్వరుద్దీన్ ఆధీనంలో ఉంచాలి. కాని డూప్లే అందుకు నిరాకరించాడు.
  • దీంతో తన డిమాండ్లను తీర్చాలని హెచ్చరిస్తూ 10 వేల మంది సైనికులను అన్వరుద్దీన్ మద్రాసు వైపు పంపాడు.
  • డూప్లే కెప్టెన్ పారడైజ్ నేతృత్వంలో 500 మంది సైనికులను కర్ణాటక వైపు పంపాడు. వీరిద్దరి మధ్య సాంథోయ్ లేదా అడయార్ యుద్ధం జరిగింది (1748లో) అన్వరుద్దీన్ సైనికులు ఓడించబడ్డారు.
  • మొదటి కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధం సాంథోయ్/అడయార్ యుద్ధం.
    కర్ణాటక రాజ్యం కొరకు జరిగిన వారసత్వ యుద్ధాల్లో బ్రిటిష్ వారి మద్దత పొందింది అన్వరుద్దీన్.
  • ఫ్రెంచి వారి మద్దతు పొందినది చాంద్ సాహెబ్.
  • అడయార్ యుద్ధంలో ఫ్రెంచి పక్షం (చాంద్సాహెబ్ , డూప్లే) గెలిచింది. బ్రిటిష్ పక్షం (బార్నెట్, అన్వరుద్దీన్) ఓడింది.
    తొలిసారి యురోపియన్ సేనలు భారతీయ రాజును ఓడించాయి.
  • 1748లో ఆక్స్-లా-చాపెల్ (ఫ్రాన్స్‌లోని పట్టణం) ఒప్పందం ప్రకారం యూరప్‌లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అంతమైంది.
    దీంతో ఇండియాలో కూడా మొదటి ఆంగ్లో-కర్ణాటక యుద్ధం అంతమైంది.
  • ఆ ఒప్పందం ప్రకారం మద్రాస్ తిరిగి బ్రిటిష్ వారికి ఇవ్వబడింది.

 

 

రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం | Second Carnatic War (1749-1754)

  • హైదరాబాద్, కర్ణాటక రాజ్యాలలో వార‌స‌త్వ తగాదాల వ‌ల్ల రెండో ఆంగ్లో క‌ర్నాట‌క యుద్దం జ‌రిగింది.
  • బ్రిటిష్ వాళ్లు నాజర్ జంగ్ (హైదరాబాద్), అన్వరుద్దీన్ (కర్ణాటక)కు మ‌ద్ద‌తు తెలిపారు.
  • ఫ్రెంచ్ వారు ముజాఫర్ జంగ్ (హైదరాబాద్), చాంద్ సాహెబ్ (కర్ణాటక)కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.
  • మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి వారు సాధించిన విజయాలు డూప్లేలో రాజ్యకాంక్షను ప్రేరేపించాయి.
  • బ్రిటిష్ పలుకుబడిని తగ్గించటానికి స్థానిక రాజ్యాల అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాడు.
  • 1748లో హైదరాబాద్ నవాబ్ నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జాహీ మరణించాడు.
  • ఇతని మరణానంతరం నాజర్ జంగ్ హైదరాబాద్ నవాబయ్యాడు. ఇతని వ్యతిరేకి ముజఫర్ జంగ్.
  • కర్ణాటకలో అన్వరుద్దీన్ వ్యతిరేకి చాంద్ సాహెబ్.
  • ఫ్రెంచి గవర్నర్ డూప్లే ముజఫర్ జంగ్, చాద్ సాహెబ్‌కు మద్దతు పలికాడు. వీరి కూటమి 1749లో అంబూర్ యుద్ధంలో అన్వరుద్దీన్‌ణు చంపేసింది.
  • దీంతో ఫ్రెంచి వారు మద్దతు తెలిపిన చాంద్ సాహెబ్ కర్ణాటక నవాబు అయ్యాడు.
  • 1750లో నాజర్ జంగ్ తొలగించబడి ఫ్రెంచి వారి మద్దతు తెలిపిన ముజఫర్ జంగ్ హైదరాబాద్ నవాబు అయ్యాడు.
  • ముజఫర్ జంగ్ మచిలీపట్నం, యానాం దీవులను ఫ్రెంచి వారికి ఇచ్చాడు.
  • 1751లో ముజఫర్ జంగ్ కడపలోని రాయచోటి దగ్గర లక్కిరెడ్డిపల్లి వద్ద కడప కర్నూలు నవాబులచే హత్యకు గురయ్యాడు.
  • హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెంచి జనరల్ బుస్సీ సలాబత్ జంగ్ (ముజఫర్ జంగ్ సోదరుడు)ను నవాబు చేశాడు. దీనికి గాను 1752లో సలాబత్ జంగ్ ఉత్తర సర్కారులు (కొండవీడు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం) ఫ్రెంచి వారికి ఇచ్చాడు.
  • కర్ణాటకలో అన్వరుద్దీన్ కొడుకు మహమ్మద్ అలీ తిరుచిరాపల్లి బ్రిటీష్ ఆశ్రయాన్ని పొందాడు.
  • తిరుచిరాపల్లిలో బ్రిటిష్ సైనికాధికారి రాబర్ట్ క్లైవ్ 500 మంది సైనికులతో కర్ణాటక రాజధాని ఆర్కాట్‌పై దాడి చేసి ఆక్రమించాడు. అందుకే క్లైవ్‌ను ఆర్కాట్ వీరుడు అంటారు.
  • అనేక చిన్న చిన్న యుద్ధాలలో చాంద్ సాహెబ్ మద్దతుదారులు ఓడించబడ్డారు. చివరకు చాంద్ సాహెబ్ పట్టుబడి ఉరి తీయబడ్డాడు.
  • మహమ్మద్ అలీ కర్ణాటక నవాబు అయ్యాడు. ఇతను ‘వల్లాజా‘ అనే పేరును పొందాడు. ఇతని వంశాన్ని వల్లాజా వంశం అంటారు.
  • చాంద్ సాహెబ్ పరాజయాలను తెలుసుకొన్న ఫ్రెంచి ప్రభుత్వం డూప్లేను వెనకకు పిలిపించి గదోహోను గవర్నర్గా పంపింది. గదోహో బ్రిటిషర్లతో పాండిచ్చేరి ఒప్పందం చేసుకొని రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధమును అంతం చేశాడు.

పాండిచ్చేరి సంధి

  • రెండవ కర్ణాటక యుద్ధం ముగియడానికి కారణమైన సంధి పాండిచ్చేరి సంధి.
  • ఈ యుద్ధంలో ఓడిపోయిన ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేని తొలగించి గదాహోను గవర్న‌ర్‌గా నియమించారు.
  • 1754లో గదాహో బ్రిటిషర్లతో పాండిచ్చేరి సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం సలాబాత్ జంగ్ హైదరాబాద్ నవాబుగా నియమించబడ్డాడు.
  • మహమ్మద్ అలీ కర్ణాటక నవాబుగా నియమించబడ్డాడు.

 

3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం | Third Carnatic War (1756-1763)

 

  • ఐరోపాలోని సప్త వర్ష సంగ్రామం వ‌ల్ల భార‌త్‌లో మూడో క‌ర్నాట‌క యుద్ధం జ‌రిగింది. ఈ సంధి పారిస్ సంధితో ముగిసింది.
  • మొదటి కర్ణాటక యుద్ధం లాగానే మూడో కర్ణాటక యుద్ధం కూడా ఐరోపాలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఏర్పడిన తగాదాల వల్ల జరిగింది.
  • యూరప్‌లోని సప్త వర్ష యుద్ధాల వల్ల భారత్‌లో 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది.
  • సప్తవర్ష సంగ్రామంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ పోరాటం ప్రారంభించగానే వీళ్ల‌ వర్తక సంఘాలు దేశంలో కూడా గొడ‌వ‌ల‌కు దిగాయి.
  • ఫ్రెంచి ప్రభుత్వం కౌంట్-డీ-లాలీని గ‌వ‌ర్న‌ర్‌గా భారతదేశానికి పంపింది.
  • కౌంట్-డీ-లాలీ దేశానికి వచ్చి హైదరాబాద్‌లో ఉన్న బుస్సీని పిలిపించి బ్రిటిష్ స్థావరాలపై దాడి చేశాడు.
  • 1760లో వందవాసి యుద్ధంలో బ్రిటిష్ జనరల్ సర్ అయ్యర్ కూట్, ఫ్రెంచి జనరల్ కౌంట్-డీ-లాలీని, బుస్సీలను ఓడించి ఖైదీగా పట్టుకున్నాడు. ఈ యుద్ధంతో ఫ్రెంచి వారు దేశంలో పూర్తిగా తమ ఆధిపత్యం కోల్పోయారు.
  • 1763లో పారిస్ ఒప్పందంతో సప్తవర్ష యుద్ధాలు యూరప్లో అంతమయ్యాయి. దీని ప్రకారం భారత్లో కూడా మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అంతమైంది. ఫ్రెంచి వారు పాండిచ్చేరికి మాత్రమే పరిమితమయ్యారు.
  • భార‌త్‌లో ఫ్రెంచి వారిని తుదముట్టించిన యుద్ధం – వందవాసి యుద్ధం (1760)
  • కర్ణాటక నవాలు మహ్మద్ అలీ మద్రాస్లోని చెపాక్ భవంతిలో విశ్రాంతి పొందుతూ పాలనా బాధ్యతలను బ్రిటిష్కు అప్పగించాడు.

 

బ్రిటిష్ కాలంలో విద్యా సంస్కరణలు

             వారెన్ హేస్టింగ్స్ 1781లో కలకత్తాలో మదర్సాను స్థాపించారు. ఆ త‌ర్వాత 1791లో బెనారస్ లో (కాశీ) సంస్కృత కళాశాలను జొనాథన్ డంకన్ నెల‌కొల్పారు.

స‌ర్ విలియం జోన్స్

  • 1784లో రాయల్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ను జోన్స్‌ స్థాపించారు. ఇతను మనుస్మృతి ఆంగ్లములోకి అనువదించాడు.
  • కాళిదాసు సంస్కృతంలో రాసిన శకుంతల నాటకాన్ని ఆంగ్లంలోనికి అనువదించి ప్రచురించాడు.
  • భారతదేశంలో విద్యావ్యాప్తికి మొదటిసారిగా లక్ష రూ. లక్ష‌ను 1813 చార్టర్ చట్టం ద్వారా కేటాయించారు.
  • 1835లో మెకాలే ప్రతిపాదించిన తీర్మానానికి మెకాలే మినిట్ అని పేరు పెట్టారు. దీని ప్రకారం ఆంగ్ల మాద్యమం అధికారికంగా గుర్తించబడింది.
  • ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఆంగ్ల భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలని అధికారికంగా 1944లో ప్ర‌క‌టించారు.

ఉడ్స్ డిస్పాచ్ 1854

  • విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలని ఉడ్స్ డిస్పాచ్ ప్ర‌తిపాదించింది.
  • భారత్‌లో ఆంగ్ల విద్యావ్యాప్తికి దీన్ని మాగ్నాకార్టాగా భావిస్తారు.
  • దేశంలో ఆధునిక విద్యా చరిత్రలో ఇదో మైలురాయి.
  • తొలిసారి 1857లో కలకత్తా, మద్రాస్, బొంబాయి నగరాల్లో 3 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు.
  • పంజాబ్‌లో 1882లో, అలహాబాద్‌లో 1887లో విశ్వవిద్యాలయాలను నెలకొల్పారు.

హంటర్ కమీషన్ 1882

  • ఈ క‌మీష‌న్‌ను లార్డ్ రిప్పన్ ఏర్పాటు చేశారు.
  • 1854లో ఉడ్స్ డిస్పాచ్ సూచించిన విధానాలను, అమలు చేసిన విధానాన్ని పరిశీలించడానికి, అలాగే అవసర‌మైన సిఫార్సులు చేయడానికి హంటర్ కమీషన్ ఏర్పాటు చేశారు.
  • భారత్‌లో విద్యా విధానాన్ని సమీక్షించ‌డానికి ఏర్పాటు చేసిన మొదటి కమీషన్.

కమీషన్ సూచనలు

  • ప్రాథమిక విద్యను ప్రోత్సహించాలి
  • ప్రతిభ ఉపకార వేతనాలు ఇవ్వాలి
  • ప్రైవేటు విద్యా సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం నిధులివ్వాలి
  • మ‌తాల‌కు అతీతంగా బోధ‌న జ‌ర‌గాలి
  • స్కూళ్ల‌ను ఇన్‌స్పెక్ట‌ర్లు త‌నిఖీ చేయాలి

1901 – లార్డ్ కర్జన్ విద్యా సంస్కరణ శకానికి నాంది పలికాడు.

థామస్ రిలే కమీషన్ (1902)

  • లార్డ్ క‌ర్జ‌న్ ఏర్పాటు చేశాడు.
  • కమీషన్ అధ్యక్షుడు థామస్ రిలే. ఈయ‌న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో న్యాయ సభ్యుడు.
  • క‌మిష‌న్‌లో స‌భ్యులు సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామి, జస్టిస్ గురుదాస్ బెనర్జీ (కలకత్తా హైకోర్టు జడ్జి)
  • యూనివర్సిటీ విద్యావిదానాన్ని సమీక్షించ‌డానికి ఏర్పాటు చేశారు.
  • ఈ కమిటీ సిఫారసు ప్ర‌కారం విశ్వవిద్యాలయ చట్టంను 1904లో ఏర్పాటు చేశారు.

హార్టోగ్ కమిటీ (1929)

  • పాఠశాల విద్య, ఉన్నత విద్యకు ప్రత్యేకంగా బోర్డులు ఉండాలని ప్రతిపాదించింది.

శాడ్ల‌ర్ కమిటీ (1917)

  • డిగ్రీ స్థాయిలో కాలపరిమితి 3 సంవ‌త్స‌రాలుగా నిర్ణయించారు.

1917లో లార్డ్ చేమ్స్ ఫర్డ్ కలకత్తా విశ్వవిద్యాలయం పని తీరును సమీక్షించుటకు శాడ్లర్ కమిటీని నియ‌మించాడు.

స‌ప్రూ క‌మిటీ (1934)

  • వృత్తివిద్య ఆవశ్యకతను తెలియజేశాడు.

(1944)

  • కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయ తరహా విద్యను భారత్ లో అభివృద్ధిపరచాలని కమిటీ సూచించింది.
  • 1919 మాంటేగు-చేమ్స్ ఫర్డ్ సంస్కరణల ద్వారా మొట్టమొదటిసారిగా విద్య భారతీయుల ఆధీపత్యంలోకి వచ్చింది.
  • దేశంలో తొలి మ‌హిళా గ్రాడ్యుయేట్ (1st Woman graduate in India) – కాదంబిని గంగూలీ
 

HISTORY PRACTICE BITS 20

 1. కాకతీయుల కాలంలో గ్రామపాలనను పర్యవేక్షించే వారిని ఏమని పిలిచేవారు?
ఎ. అయగార్లు
బి. ఇనామ్‌దార్
సి. గ్రామణి
డి. గోమేయక
సమాధానం: ఎ

2. నిజాం ప్రభుత్వం ఏ దశాబ్దకాలంలో గోండుల భూములు బ్రిటీష్ వారికి ఇచ్చినది?
ఎ. 1920-30
బి. 1910-20
సి. 1900-1920
డి. 1800-1900
సమాధానం: ఎ

3. రాచకొండ, దేవరకొండ, వెలమ నాయకుల పాలనా కాలంలో వారి శాసనాలు కింది ఏ భాషలో వేయించబడ్డాయి?
ఎ. సంస్కృతం
బి. తెలుగు
సి. సంస్కృతాంధ్రం
డి. పైవన్నీ
సమాధానం: డి

4. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ. 1909
బి. 1910
సి. 1911
డి. 1912
సమాధానం: సి

5. మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం ఏది?
ఎ. యయాతి చరిత్ర
బి. నిరంకుశోపాఖ్యానం
సి. సుగ్రీవ విజయం
డి. తపతీసంవరణోపాఖ్యానం
సమాధానం: ఎ

6. హైదరాబాద్ రాజ్యాన్ని అసఫ్‌జాహీ వంశం ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది?
ఎ. 234 సంవత్సరాలు
బి. 204 సంవత్సరాలు
సి. 214 సంవత్సరాలు
డి. 224 సంవత్సరాలు
సమాధానం: డి

7. భట్టిప్రోలు ప్రాచీన నామం ఏది?
ఎ. కంకట శిల
బి. ప్రతిపాలపురం
సి. దనదపురం
డి. సారంగపురం
సమాధానం: బి

8. మేళ్ల చెరువు జాతర కింది ఏ జిల్లాలో జరుగుతుంది?
ఎ. ఖమ్మం
బి. నల్లగొండ
సి. వరంగల్
డి. మహబూబ్‌నగర్
సమాధానం: బి

9. ఆర్యసమాజం హైదరాబాద్ విషయాన్ని జాతీయ సమస్యగా మార్చి దేశమంతటా ఏమి నిర్వహించింది?
ఎ. హైదరదాబాద్ డే
బి. నిజాం డే
సి. తెలంగాణ డే
డి. మహారాష్ట్ర డే
సమాధానం: ఎ

10. రేచర్ల పద్మనాయకుల పరిపాలనా కాలంలో వైష్ణవాన్ని ఆదరించిన రాజు ఎవరు?
ఎ. సింగ భూపాలుడు
బి. వేదగిరి
సి. నైనాచార్యలు
డి. మాదనాయకుడు
సమాధానం: ఎ

HISTORY PRACTICE BITS 19

 1. సముద్రగుప్తుడి అలహాబాద్ స్తంభ శాసన రచయిత ఎవరు?
ఎ. కుమార వల్లభుడు
బి. హరిసేనుడు
సి. దేవీగుప్తుడు
డి. హరిపుత్ర
సమాధానం: బి

2. కింది బౌద్ధమత శాఖలలో సిలోన్‌లో బాగా వేళ్లూనుకొన్నది ఏది?
ఎ. మహాయాన బౌద్ధమతం
బి. హీనయాన బౌద్ధమతం
సి. మహేంద్ర బౌద్ధమతం
డి. వజ్రయాన బౌద్ధమతం
సమాధానం: బి

3. దేవర్ణి క్షమాశ్రవణుడు ఎవరు?
ఎ. వల్లభిలో జరిగిన రెండో జైన పరిషత్తు అధ్యక్షుడు
బి. వైశేయాన సంప్రదాయ స్థాపకుడు
సి. వాకాటన్ రాజ్యంలోని ప్రముఖ ఆస్థానకవి
డి. మైత్రికులలో మొదటి గొప్పరాజు
సమాధానం: ఎ

4. మూడో బౌద్ధమత పరిషత్తు ఎక్కడ జరిగింది?
ఎ. పాటలీపుత్రం
బి. పెషావర్
సి. శాక్యపురి
డి. కనౌజ్
సమాధానం: ఎ

5. తంజావూరులోని రాజరాజేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు?
ఎ. రాజరాజ చోళుడు
బి. రాజేంద్ర చోళుడు
సి. రాజాధిరాజు
డి. నరసింహావర్మ
సమాధానం: ఎ

6. మొగలు చక్రవర్తిగా అక్బర్ పట్టాబిషక్తుడయ్చేటప్పటికి అతని వయస్సు ఎంత?
ఎ. 13ఏండ్లు
బి. 10ఏండ్లు
సి. 21ఏండ్లు
డి. 19ఏండ్లు
సమాధానం: ఎ

7. కామందకుడి నీతిసారం మనకు ఎవరి నుంచి ఎక్కువగా సమాచారం అందిస్తుంది?
ఎ. మౌర్యులు
బి. గుప్తులు
సి. బహుమనీ రాజులు
డి. విజయనగర సామ్రాజ్యం గురించి
సమాధానం: బి

8. గుప్తులకాలంలో వర్తకుల సముదాయాన్ని ఏమనేవారు?
ఎ. పుగ
బి. శ్రేణి
సి. కర్షపణ
డి. రూప్యక్
సమాధానం: ఎ

9. మొగలుల కాలంలో నగదు లావాదేవీలన్నింటికీ ఉన్న మౌలిక యూనిట్‌ను ఏమనేవారు?
ఎ. బంగారు మెహర్ లేదా అష్రఫ్
బి. వెండి రూపాయి
సి. రాగి డామ్ లేదా పైసా
డి. ఏదీకాదు
సమాధానం: ఎ

10. మౌర్యుల మంత్రి పరిషత్తును ఏమనేవారు?
ఎ. సమహర్తసభ
బి. అధ్యక్షమండలి
సి. మంత్రి పరిషత్తు
డి. దమ్మ మహామాత్రులు
సమాధానం: సి

HISTORY PRACTICE BITS 18

 1. భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఏది?
ఎ. సాంచీ
బి. సారనాథ్
సి. కౌశాంబి
డి. రాజగృహం
సమాధానం: ఎ

2. నిజాం ఉల్ ముల్క్ మహారాష్ట్రులతో చేసుకున్న సంధి
ఎ. ముషిగావ్ సంధి
బి. వార్నా సంధి
సి. దురారీ సరాయి సంధి
డి. పైవన్నీ
సమాధానం: డి

3. అనాది తెగల ఆచారమైన మాతృదేవతారాధన, నాగపూజ ఎవరి కాలంలో కనిపిస్తున్నది?
ఎ. శాతవాహనులు
బి. పల్లవులు
సి. ఇక్ష్వాకులు
డి. ఎవరూ కాదు
సమాధానం: సి

4. హైదరాబాద్‌లో ఆర్యసమాజ శాఖ అధ్యక్షులు ఎవరు?
ఎ. కామత్ ప్రసాద్ జీ మిశ్రా
బి. లక్ష్మణ్ దాస్ జీ
సి. స్వామి రామానంద తీర్థ
డి. పండిత సోమ్‌నాథ
సమాధానం: ఎ

5. తెలంగాణలో విష్ణుకుండినుల చరిత్రకు సంబంధించిన సాక్ష్యాధారాలుగా నిలిచిన శాసనాలు లభ్యమైన ప్రదేశం ఏది?
ఎ. తుమ్మల గూడెం(నల్లగొండ జిల్లా)
బి. కీసర (రంగారెడ్డి జిల్లా)
సి. కోటిలింగాల (కరీంనగర్ జిల్లా)
డి. కొండాపురం (మెదక్ జిల్లా)
సమాధానం: ఎ

6. నిజాం రాష్ట్ర సంస్కార మహాసభలు ఏ సంవత్సరంలో జరిగాయి?
ఎ. 1920
బి. 1921
సి. 1922
డి. 1923
సమాధానం: బి

7. కొరవి సీమకు గల మరోపేరు?
ఎ. పల్లవనాడు
బి. విసరునాడు
సి. సబ్బినాడు
డి. ఏదీకాదు
సమాధానం: బి

8. దక్కన్ కేసరి పత్రిక ఏ సంవత్సరంలో వెలువడింది?
ఎ. 1935
బి. 1936
సి. 1937
డి. 1938
సమాధానం: ఎ

9. వేములవాడ చాళుక్యలలో ప్రసిద్ధుడు ఎవరు?
ఎ. రెండో అరికేసరి
బి. బద్దెగుడు
సి. మొదటి అరికేసరి
డి. యుద్ధమల్లుడు
సమాధానం: ఎ

10. సంస్కృత కళావర్ధిని గ్రంథాలయం ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ. హైదరాబాద్
బి. సికింద్రాబాద్
సి. వరంగల్
డి. సూర్యాపేట
సమాధానం: బి

HISTORY PRACTICE BITS 17

  1. రాగి వస్తువులు ఎక్కువగా లభించిన తామ్రశిలాయుగ స్థావరమేది?
ఎ. ఇనాంగాన్
బి. అహర్
సి. గిలుండ్
డి. నెవాసా

2. ప్రపంచంలో మొట్టమొదటగా ఇనుము ఎక్కడ కనుగొన్నారు?
ఎ. ఆసియా
బి. యూరప్
సి. ఈజిప్టు
డి. యురేషియా

3. ప్రాచీన శిలాయుగంలో మానవుడు పనిముట్లకు ఉపయోగించిన రాయి?
ఎ. చలవరాయి
బి. క్వార్ట్‌జైట్
సి. గ్రానైట్
డి. సున్నపురాయి

4. ద్రావిడులు ఏ జాతికి చెందినవారు?
ఎ. మెడిటేరియన్
బి. నార్డిక్‌లు
సి. మంగోలాయిడ్‌లు
డి. నీగ్రిటోలు

5. భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ ఏ శతాబ్దంలో రూపుదిద్దుకున్నది?
ఎ. క్రీ.పూ. 2, 3వ శతాబ్దంలో
బి. క్రీ.పూ. 5, 6వ శతాబ్దంలో
సి. క్రీ.పూ. 6వ శతాబ్దంలో
డి. క్రీ.శ. 12, 13వ శతాబ్దంలో

6. ఢిల్లీ సుల్తానుల కాలంలో దివాన్ ఇ ఇన్షా శాఖ దేనికి సంబంధించిన విభాగం?
ఎ. మత సంబంధ విషయాలను చూసేది
బి. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాల బట్వాడా
సి. రాజగృహ సంబంధ వ్యవహారాలను చూసేది
డి. ప్రజా పనుల విభాగం

7. ప్రాచీన స్మారక భవనాల పరిరక్షణ చట్టాన్ని చేసిన గవర్నర్ జనరల్?
ఎ. మింటో
బి. మౌంట్ బాటన్
సి. కర్జన్
డి. లిన్ లిథ్‌గో

8. సింధు లోయ ప్రజలు తగరాన్ని ఎక్కడ నుంచి తెప్పించుకునేవారు?
ఎ. ఆఫ్ఘనిస్థాన్
బి. ఖేత్రి గనులు
సి. గుజరాత్
డి. మెసొపొటేమియా

9. రుగ్వేద కాలం నాటి ఆర్యుల భౌగోళిక విజ్ఞానం, కింది ప్రాంతాల్లో దేనిని దాటి విస్తరించలేదు?
ఎ. బిహార్
బి. సట్లెజ్
సి. యమున
డి. సింధు

10. మలివేద కాలంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించిన దేవత ఎవరు?
ఎ. ఇంద్రుడు
బి. ప్రజాపతి
సి. పశుపతి మహాదేవుడు
డి. అగ్ని

జవాబులు
1-2,2-4,3-2,4-1,5-2,

6-2,7-3,8-1,9-3,10-2.