సిరాజ్ ఉద్దౌలా | Siraj ud Daulah


    • సిరాజ్ ఉద్దౌలా అసలు పేరు మీర్జా మహమ్మద్. ఆలివర్దీ ఖాన్ 3వ కూతురు కొడుకు. తన తరువాతి వారసుడిగా సిరాజ్ ఉద్దౌలానే అలీవర్దీ ఖాన్ ప్రకటించాడు.
    • ఇతని పట్టాభిషేకంను బ్రిటిష్ వారు బహిష్కరించారు. ఇతనే బెంగాల్ చివరి స్వంతంత్ర నవాబు.
    • బెంగాల్లో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం చంద్రనాగూర్
    • బ్రిటీష్ వారి ప్రధాన వర్తక స్థావరం – కలకత్తా
    • ఇదే టైంలో దక్షిణ భారత్లో బ్రిటిష్, ఫ్రెంచ్ వారి మధ్య మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం మొదలైంది.
    • బెంగాగాల్‌లో బ్రిటిష్, ఫ్రెంచ్ వాళ్లు తమ స్థావరాల చుట్టూ రక్షణ గోడలను నిర్మించుకోవడం ప్రారంభించారు.
    • సిరాజ్ ఈ రక్షణ గోడల నిర్మాణమును ఆపేయాలని ఆజ్ఞలను జారీ చేశాడు. చంద్రనాగూర్‌లో ఉన్న ఫ్రెంచి వారు దీనిని అంగీకరించగా బ్రిటిషర్లు తిరస్కరించారు.
    • దీంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ ఫోర్ట్ విలియంను 1756 జూన్ 20న ఆక్రమించాడు.
    • కాశీంబ‌జార్‌పై దాడి చేసి బ్రిటిష్ స్థావరాలను ధ్వంసం చేసి సుమారు 146 మందిని ఓ చీకటి గదిలో బంధించాడు.
    • ఇందులో 23 మందే బ్రతికినట్లు హల్వెల్ ప్ర‌క‌టిస్తారు. దీన్నే కలకత్తా చీకటి గది ఉందంతం (Black Hole of Calcutta) అంటారు.

    • కలకత్తా ఆక్రమణ తర్వాత సిరాజ్ కలకత్తాకు పెట్టిన పేరు – అలీసాగర్
    • కలకత్తాకు నియమింపబడిన సాలకుడు – మాణిక్ చంద్
    • బ్రిటిష్ సేనాని రాబర్ట్ క్లైవ్ మాణిక్ చంద్‌కు బహుమానాలిచ్చి కలకత్తాను మళ్లీ ఆక్రమిస్తాడు.
    • తర్వాత క్రీ.శ. 1757 ఫిబ్రవరి 9న బ్రిటిషర్లతో సిరాజ్ అలీసాగర్ సంధి చేసుకుంటాడు.
    • అంతవరకు బ్రిటిషర్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాపై వారి హక్కును గుర్తించాడు.
    • ఆలీనగర్ సంధిని ఉల్లంఘిస్తూ రాబర్ట్ క్లైవ్ ఫ్రెంచ్ వర్తక స్థావరం చంద్ర‌నాగూర్‌ను ముట్టడిస్తాడు.
    • ఈ ముట్టడిలో ఓడిన ఫ్రెంచ్ వాళ్లకు సిరాజ్ ఆశ్రయం ఇస్తాడు.