AP Budget 2021-22 : ఏపీ బడ్జెట్ హైలైట్స్

        ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,29,779.27 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తొలిసారి జెండర్ బేస్డ్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలు, చిన్నారులకు బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించిందిరూ.47,283 కోట్లతో జెండర్బడ్జెట్తెచ్చింది.


 2021-22 రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లు
రెవెన్యూ వ్యయం - రూ.లక్షా 82 వేల 196 కోట్లు
మూలధన వ్యయం - రూ.47,582 కోట్లు
రెవెన్యూ లోటు - రూ.5 వేల కోట్లు
ద్రవ్యలోటు - రూ.37,029.79 కోట్లు
జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.49 శాతం
రెవెన్యూ లోటు 0.47 శాతం

 

ఏయే రంగానికి ఎంత కేటాయింపులు :

బీసీ సబ్‌ ప్లాన్‌కి రూ.28,237 కోట్లు
కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు
ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు
ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు
ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు
మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు
చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు
మహిళల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు
వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు
విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు
వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు
వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు రూ.17 వేల కోట్లు
వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కోసం రూ.3,845 కోట్లు
జగనన్న విద్యా దీవెనకు రూ.2,500 కోట్లు
జగనన్న వసతి దీవెన కోసం రూ.2,223.15 కోట్లు
వైఎస్‌ఆర్‌-పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1802 కోట్లు
డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు
పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు
రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు
వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు
వైఎస్‌ఆర్‌ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు
వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు
వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు
వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు
మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు
రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు
లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు
ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు
వైఎస్‌ఆర్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు
అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు
వైఎస్‌ఆర్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు
రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు
వైఎస్‌ఆర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు
వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు
వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు
వైఎస్ఆర్‌ పశువుల నష్టపరిహారానికి రూ.50 కోట్లు
విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు
స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు
జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు
జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు
ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ.13,840.44 కోట్లు
ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు
ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు
కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు
ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు
శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు
హౌసింగ్‌, మౌలిక వసతులకు రూ.5,661 కోట్లు
పరిశ్రమలకు ఇన్సెంటివ్‌ల కోసం రూ.1000 కోట్లు
ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌కు రూ.200 కోట్లు
కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం రూ.250 కోట్లు
ఏపీఐఐసీకి రూ.200 కోట్లు కేటాయింపు
ఎంఎస్‌ఎంఈలో మౌలిక వసతులకు రూ.60.93 కోట్లు
పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు రూ.3,673.34 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు రూ.7,594.6 కోట్లు
ఎనర్జీ రంగానికి రూ.6,637 కోట్లు
వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణకు రూ.1,556.39 కోట్లు
వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌కు రూ.243.61 కోట్లు
దిశ కోసం రూ.33.75 కోట్లు
అంగన్వాడీల్లో నాడ-నేడు కార్యక్రమాలకు రూ.278 కోట్లు
వైఎస్‌ఆర్‌ బీమాకు రూ.372.12 కోట్లు
అర్చకుల ఇన్సెంటివ్‌లకు రూ.120 కోట్లు
ఇమామ్‌, మౌజాంల ఇన్సెంటివ్‌లకు రూ.80 కోట్లు
పాస్టర్ల ఇన్సెంటివ్‌లకు రూ.40 కోట్లు
ల్యాండ్‌ రీసర్వే కోసం రూ.206.97 కోట్లు
పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖకు రూ.8,727 కోట్లు
నీటిపారుదల శాఖకు రూ.13,237.78 కోట్లు