నీరు

 

* దీని రసాయన నామం హైడ్రోజన్ మోనాక్సైడ్, ఫార్ములా H2O.
* భూమిపై నీరు 3/4 వ వంతు, ప్రకృతిలో 70% ఆక్రమించి ఉంది.
* శరీర బరువులో 70% నీరు ఉంటుంది.
* నీటిని పరిశ్రమల్లో ద్రావణిగా (ఎక్కువ పదార్థాలను కరిగించుకోవడం), శీతలీకరణిగా (యంత్రాలు చల్లబరచడానికి) ఉపయోగిస్తారు.
* నీరు లభించే ప్రదేశాలను 'నీటి వనరులు' అంటారు.

 

నీటి వనరులు
1) సముద్రాలు
2) నదులు
3) చెరువులు / సరస్సులు
4) బావులు
5) నీటి బుగ్గ లేదా స్ప్రింగ్
6) ఒయాసిస్సు
7) నీటి ఫలకం

 

నీరు - ధర్మాలు
* స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండవు.
* పారదర్శకంగా ఉంటుంది.

 

నీటికి మూడు రకాల పీడనాలు ఉంటాయి
1) ఊర్థ్వ పీడనం
2) అథో పీడనం
3) పార్శ్వ పీడనం
* లోతు ఎక్కువైన కొద్దీ పీడనం పెరుగుతుంది.
* పాత్ర ఆకారం, పరిమాణం పీడనాన్ని ప్రభావితం చేయలేవు. నీటి

1) నీటి తాత్కాలిక కాఠిన్యతను తొలగించడానికి మరిగించడం, క్లార్క్‌ విధానాన్ని ఉపయోగిస్తారు.
    Ca(HCO3)2    CaCO3 + H2O + CO2
2) క్లార్క్ పద్ధతిలో తడి సున్నాన్ని కలుపుతారు.
     Ca(HCO3)2 + Ca(OH)2 2 CaCO3 + 2 H2O
* తాత్కాలిక కాఠిన్యత తొలగించడానికి చాకలి సోడాను కలుపుతారు.
    Ca(HCO3)2 + Na2CO3  CaCO3 + 2 NaHCO3
* దీని ద్వారా తాత్కాలిక, శాశ్వత కాఠిన్యతను తొలగిస్తారు.

శాశ్వత కాఠిన్యతను తొలగించే పద్ధతులు

1) పెర్మిట్యూట్‌ పద్ధతి:
* దీనిలో ఉపయోగించే పదార్థం సోడియం పెర్మిట్యూట్‌(Na2Al2S2O8).
* కఠినజలం సాధు జలంగా మారిన తర్వాత పాత్రలో ఏర్పడే పదార్థాలు Ca, Mg, పెర్మిట్యూట్‌.
* చర్యా వేగాన్ని పెంచడానికి గాఢ NaCl ద్రావణాన్ని కలుపుతారు.
2) అయాన్‌ల మార్పిడి పద్ధతి:
* కఠినజలంలోని ధనాత్మక అయాన్‌లు Ca+, Mg+.

* A, B పాత్రలు ఉంటాయి.
* A పాత్రలోని రసాయన పదార్థం జీరోకార్ఫ్.
* B పాత్రలోని రసాయన పదార్థం డీఎసిటైట్.
* A పాత్రలోని చర్యాశీలతను పూర్వస్థితికి తీసుకురావడానికి HCl ను కలుపుతారు.
* B పాత్ర చర్యాశీలతను పూర్వస్థితికి తీసుకురావడానికి Na2CO3 కలుపుతారు.
* నీటి ద్రవీభవన ఉష్ణోగ్రత 0°C, బాష్పీభవన ఉష్ణోగ్రత 100°C
* నీటి రూపాలు
1. తుషారం   2. పొగమంచు     3. ఫ్రాస్ట్    4. మేఘాలు   5. మంచు

నీటిలోని మలినాలు
1) కరగని మలినాలు
2) కరిగే మలినాలు
1) కరగని మలినాలకు తేర్చుట, పానీయపద్ధతి ఉపయోగిస్తారు.
* తేర్చుటలో ప్రక్రియ త్వరగా జరగడానికి పటికపొడి, చిల్లగింజల గంధం వాడతారు. దీనికి ఎక్కువ సమయం పడుతుంది.
2) పానీయ పద్ధతి చికిత్సలో వాంతులు, విరేచనాలైన రోగికి నీటిలో ఉప్పు, పంచదార కలిపి ఇస్తారు.
* తాగు నీటిని శుభ్రపరచడానికి ఖర్చులేని, తేలికైన పద్ధతి మూడు కుండల పద్ధతి.

 

రక్షిత మంచినీటి పథకంలోని దశలు
1) సేకరించడం
2) నిల్వచేయడం (నీటిని నిల్వచేసే ట్యాంకు సెడిమెంటేషన్ ట్యాంకు. దీనిలో పటికపొడి కలుపుతారు.)
3) వడపోత మడులు
4) క్లోరినేషన్
5) పంపింగ్
6) పంపిణీ