2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.28,866.23 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ను మంత్రి బొత్స సత్యనారాయణ శాసన సభలో ప్రవేశపెట్టారు. సోదరుడి ఆకస్మిక మరణం కారణంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శాసనసభకు అసెంబ్లీకి రాలేకపోయారు. దీంతో ఆయన బదులు వ్యవసాయ బడ్జెట్ను బొత్స ప్రవేశపెట్టారు. రూ.28,866.23 కోట్ల వ్యవసాయ బడ్జెట్లో.. రెవిన్యూ వ్యయం రూ. 27,946.65 కోట్లు కాగా పెట్టుబడి వ్యయం రూ. 919.58 కోట్లు. రైతు పెట్టుబడి సాయం కింద రూ.8750 కోట్లు కేటాయించారు. రైతు భరోసా కింద ఒక్కో రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 సాయం చేయనున్నారు.
కౌలు రైతుల సంక్షేమం కోసం పట్టాదారుకు ఇబ్బంది లేకుండా 11 నెలలకు కౌలు పత్రం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కోసం రూ.1163 కోట్లు, వడ్డీ లేని రుణాల కోసం రూ.100 కోట్లు, వైఎస్సార్ రైతు బీమా కోసం రూ. 100 కోట్లు కేటాయించారు. . తుంపర, బిందు సేద్యం పథకాల కోసం రూ.1105.66 కోట్లు కేటాయించారు. పాడి రైతుకు లీటర్కు రూ.4 చొప్పున బోనస్ ఇస్తామన్నారు. కౌలు రైతులకు రూ.1200 కోట్లు, రైతులకు సహకార సంఘాల దీర్ఘాకాలిక రుణాల కింద రూ.1500 కోట్లు కేటాయించారు.
· ధరల స్థిరీకరణ నిధి: రూ. 3000 కోట్లు
· ప్రకృతి విపత్తుల నిర్వహణ నిధి: రూ. 2000 కోట్లు
· జాతీయ ఆహార భద్రతా మిషన్: రూ. 141.26 కోట్లు
· వైఎస్ఆర్ రైతు బీమాకు రూ.100 కోట్లు
· ఉచిత పంటల బీమా పథకానికి రూ. 1163 కోట్లు
· వ్యవసాయ యాంత్రీకరణకు రూ.460.05 కోట్లు
· రాష్ట్రీయ కృషి యోజన పథకం: రూ.341 కోట్లు
· విత్తన సరఫరా: రూ. 200 కోట్లు
· భూసార యాజమాన్యం పథకం: రూ. 30.43 కోట్లు
· సూక్ష్మధాతు లోపం సహాయం: రూ. 30.05 కోట్లు
· నేషనల్ మిషన్ ఫర్ సస్టేనబుల్ అగ్రికల్చర్: రూ. 233 కోట్లు
· జీరో బడ్జెట్ వ్యవసాయానికి రూ.91 కోట్లు
· వ్యవసాయ విభాగ అభివృద్ధి కోసం రెవిన్యూ వ్యయం: రూ.12280.14 కోట్లు
· గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రెవిన్యూ వ్యయం: రూ.355 కోట్లు
· నాబార్డ్ - ఆర్ఐడిఎఫ్ పెట్టుబడి వ్యయం: రూ.60 కోట్లు
· ఉద్యాన శాఖ రెవిన్యూ వ్యయం: రూ. 1532 కోట్లు
· ఉద్యాన విశ్వవిద్యాలయాల అభివృద్ధి రెవిన్యూ వ్యయం: రూ.63.60 కోట్లు
· పట్టు పరిశ్రమ రెవిన్యూ వ్యయం రూ. 158.46 కోట్లు
· పశుసంవర్దక శాఖ రెవిన్యూ వ్యయం రూ.1077 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.163.06 కోట్లు
· శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రూ.87 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.30 కోట్లు
· మత్స్యశాఖ రెవిన్యూ వ్యయం రూ.409.62 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.141.24
· వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రెవిన్యూ వ్యయం రూ. 3012.34 కోట్లు, క్యాపిటల్ వ్యయం 200.10 కోట్లు
· సహకార రంగం రెవిన్యూ వ్యయం 174.64 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ. 60 కోట్లు
· రైతాంగానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా: రూ.4525 కోట్లు.
· ఆక్వా రంగ రైతులకు 1.50 రూపాయల చొప్పున విద్యుత్ సరఫరా కోసం: రూ.475 కోట్లు
.